మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య డాక్టర్ ఎస్ మాణిక్యరావు
విశాలాంధ్ర- అనంతపురం వైద్యం : ప్రభుత్వ మెడికల్ కళాశాల అనంతపురం సామాజిక వైద్యశాస్త్ర ప్రధాన విభాగాధిపతి మరియు వైస్ ప్రిన్సిపాల్ ఆచార్య డాక్టర్ ఆరేపల్లి శ్రీదేవి అదనపు వైద్య విద్య సంచాలకులు మరియు ప్రిన్సిపాల్ గా పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాలకు ప్రమోషన్ పొంది వెళుతుండడంతో ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ మాణిక్యరావు ఆధ్వర్యంలో అభినందన సత్కార సభ ఎన్ ఎం సీ కౌన్సిల్ సమావేశ మందిరంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ మాణిక్యరావు మాట్లాడుతూ డాక్టర్ ఆరేపల్లి శ్రీదేవి సేవలు, అనంత వైద్య కళాశాలకు వైస్ ప్రిన్సిపాల్ గా, ఏడు నెలలపాటు ప్రిన్సిపాల్ గా చాలా సమర్థవంతంగా తన బాధ్యతలను త్రికరణ శుద్ధితో నిర్వర్తించారని, అందరితో కలిసిపోయి సమిష్టి కృషితో తను ఈ కళాశాల ను అభివృద్ధి పరచడంలో తన ముద్ర వేసుకున్నారు అన్నారు.
ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ మాణిక్యరావు, వైస్ ప్రిన్సిపాల్ లు డాక్టర్ సుబ్రమణ్యం, డాక్టర్ షారోన్ సోనియా, డాక్టర్ శ్యాం ప్రసాద్, వైద్య కళాశాల ప్రొఫెసర్ లు, ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఆర్.ఎం. ఓ లు, ఇతర డాక్టర్లు ఘనంగా సత్కరించారు.
సత్కారం స్వీకరించిన ఆచార్య డాక్టర్ ఆరేపల్లి శ్రీదేవి మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా ఈ కళాశాలలో ఎన్నో మంచి మధుర జ్ఞాపకాలను ఇచ్చారని, పులివెందుల వైద్య కళాశాలను ప్రగతి ప్రధాన నడిపించడానికి అనంత వైద్య కళాశాలలో పనిచేసిన అనుభవం, ఇక్కడి డాక్టర్ల అద్భుతమైన పనితీరు, వైద్య విద్యార్థుల ప్రేమ అనంతమైనదని అది ఎంతగానో భవిష్యత్తులో ఉపయోగపడుతుందని సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు డాక్టర్ శంషాద్ బేగం, డాక్టర్ సంధ్య, డాక్టర్ సుచిత్ర శౌరి, డాక్టర్ సరళ, డాక్టర్ దుర్గ, డాక్టర్ శంకర్, డాక్టర్ తెలుగు మధుసూదన్, డాక్టర్ వాల్మీకి శ్రీనివాస్, డాక్టర్ నీహారిక, డాక్టర్ సుభాష్ చంద్రబోస్, డాక్టర్ సుమన గోపీచంద్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఆదిరెడ్డి పరదేశి నాయుడు, తదితరులు పాల్గొన్నారు.