విశాలాంధ్ర – పెనుకొండ : పెనుకొండ నందు పరిటాల శ్రీరాములు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దివంగత ప్రిన్సిపల్ డాక్టర్ ఎం రమేష్ రెడ్డి సంస్మరణ సభ ఘనంగా జరిగింది. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కే జయప్ప అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి పుర ప్రముఖులు, కుటుంబ సభ్యులు, పూర్వ విద్యార్థులు పాల్గొని తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కళాశాల చరిత్రలో ఇప్పటివరకు జరగని అభివృద్ధికి బాటలు వేసి,అరుదైన స్వభావంతో విద్యార్థులను ఆదర్శాల వైపు మళ్ళించిన రమేష్ రెడ్డి ఎప్పటికీ చిరస్మరలీయులేనని, కళాశాల అభివృద్ధి విషయంలో ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. దివంగత ప్రిన్సిపల్ సతీమణి మాధవి మాట్లాడుతూ వృత్తిలో అంకితభావంతో వుంటూనే,కుటుంబ జీవితానికి ప్రాధాన్యతనిస్తూ, స్త్రీ సమానత్వాన్ని కోరే తన భర్త ఆశయ సాధన కోసం పని చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రీనివాసులు, కౌన్సిలర్ సుధాకర్ రెడ్డి, సాహితీ స్రవంతి వేదిక కన్వీనర్ హరి, అడ్వకేట్ నరసింహారెడ్డి, అంజిరెడ్డి, సిద్ధార్థ రెడ్డి, పూర్వ విద్యార్థులైన లేబర్ ఆఫీసర్ నరేష్, ఫైర్ ఆఫీసర్ మల్లికార్జున్,అధ్యాపకులు చెన్నారెడ్డి శ్రీదేవి,ప్రతాప్ విద్యార్థులు పాల్గొన్నారు.