.పారశుద్ధ్య పనిమూట్లు,వాటర్ వర్క్ లో జరుగుతున్న అవినీతి ప్రచారంపై కమిటీ వేయాలి
—ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ ) జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ గౌడ్
విశాలాంధ్ర-అనంతపురం : మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించలేని అధికారులపై చర్యలు తీసుకోవాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ ) జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ గౌడ్ డిమాండ్ చేశారు,అనంత నగర పాలక సంస్థ కార్యాలయం ముందు సోమవారం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ ) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది,అనంతరం మేయర్ చాంబర్ వద్దకు వెళ్ళి ఆందోళన నిర్వహించారు,మేయర్ బయటకు వచ్చి సమాధానం చెప్పారు.ఈ సందర్భంగా రాజేష్ గౌడ్ మాట్లాడుతూ… నగర పాలక సంస్థలో కార్మికులకు సరిపడ పనిమూట్లు ఇవ్వకుంటే వారు ఏ విధంగా పనిచేయాలన్నారు,పనిమూట్లు తెప్పించే విషయంలో మరియు వాటర్ వర్క్స్ చేయించే దానిలో అవినీతికి పాల్పడ్డారని జరుగుతున్న ప్రచారాన్ని నిగ్గుతేల్చే విధంగా కమిటీ వేయాలన్నారు,దీర్ఘకాలికంగా ఉన్న ఈపీఎఫ్, ఈ ఎస్ ఐ సమస్యలు పరిష్కారంకావడంలేదన్నారు,మరణించిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులను తీసుకోకుండా 2 సం,ల నుండి పెండింగ్ పెట్టారన్నారు,డెత్ క్లైములు అలానే ఉన్నాయన్నారు,కార్మికులకు అధికారుల నుండి పనివత్తిడి పెరిగిపోయిందని నగర జనాభాకు అనుగుణంగా కార్మికుల సంఖ్య పెంచాలన్నారు,ఇంజనీరింగ్ కార్మికులకు సంక్షేమ పథకాలు ఇవ్వకుండా గత ప్రభుత్వం చేసిన తప్పులు ఈ ప్రభుత్వం చేయకుండా సంక్షేమ పథకాలు ఇవ్వాలన్నారు,బకాయి ఉన్న 2011 సం,, 9 నెలల ఈపీఎఫ్ కార్మికుల ఖాతాల్లో జమచేయాలన్నారు,మున్సిపల్ స్కూల్ స్వీపర్స్&వాచ్మెన్లకు 7 నెలలుగా వేతనాలు బకాయి పెట్టారని కార్మికులు ఏ విధంగా బతకాలో అధికారులు చెప్పాలన్నారు, పాలకవర్గం,అధికారులు సమస్యలు పరిష్కరించకపోతే దశలవారి ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఏ ఐ టి యు సి నగర ప్రధాన కార్యదర్శి కృష్ణుడు,ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు చిరంజీవి,జిల్లా నాయకులు నాగరాజు,ప్రసాద్,శివకృష్ణ,నాగేంద్ర బాబు,రఫీ,అసేన్,రామాంజినేయులు,ఎర్రప్ప,దేవమ్మ,నాయుడు,కాంతమ్మ,లక్ష్మి తదితరులు పాల్గొన్నారు…