విశాలాంధ్ర-రాప్తాడు : త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా పోలింగ్ కేంద్రాల్లో అన్ని రకాల మౌలిక వసతులను కలిస్తామని ఎంపీడీఓ గీతావాణి తెలిపారు. గురువారం గంగులకుంట, రాప్తాడు, అయ్యవారిపల్లి గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలను ఆమె పరిశీలించారు. ఓటర్లకు అవసరమైన సదుపాయాలు ఉన్నాయో లేదో అడిగి తెలుసుకున్నారు. వికలాంగ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు రావడానికి వీలుగా అవసరమైన ర్యాంపులు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యుత్తు, తాగునీరు, మరుగుదొడ్లు సైతం ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికలు పారదర్శకంగా జరిగేందుకు బీఎల్ఓలు, బీఎల్ఎలు పార్టీలకతీతంగా నడచుకోవాలన్నారు. కార్యక్రమంలో ఈఓఆర్ నరసింహారెడ్డి, పంచాయితీ కార్యదర్శి వి.రమణారెడ్డి , హెచ్ఎం నరసింహులు పాల్గొన్నారు.