ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జాన్సన్ బాబు
విశాలాంధ్ర – జేఎన్టీయూఏ: స్వాతంత్ర సమరయోధులు, విప్లవ యువకిశోరులు భగత్ సింగ్,రాజ్ గురు,సుఖ్ దేవ్ ల ఆశయాలను అనుసరిద్దామని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జాన్సన్ బాబు పేర్కొన్నారు. శనివారం 93వ వర్ధంతిని నీలం రాజశేఖర్రెడ్డి భవనం లో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ,ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆనంద్ కుమార్ సంతోష్ కుమార్ ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రమణయ్య కుళాయి స్వామి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ. అతి చిన్న వయసులో దేశ సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన రియల్ హీరోలని కొనియాడారు, నాడు స్వేచ్ఛ స్వాతంత్రం, ప్రజాస్వామ్యం, లౌకికవాద పరిరక్షణ కొరకు అనేకమంది ప్రాణ త్యాగాలు చేసిన వారిలో భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ లని గుర్తు చేసుకున్నారు, నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం వారి రాజకీయ స్వలాభం కోసం కులాలకు,మతాలకు మధ్య చిచ్చు పెడుతూ పబ్బం గడుపుతున్నారని అన్నారు, యువత భవిష్యత్ తరాల కోసం నాడు స్వాతంత్రోద్యమంలో తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన మహనీయులు చరిత్ర కలిగిన దేశం మనది అన్నారు. భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయిమెంట్ గ్యారంటీ యాక్ట్ అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నగర కార్యదర్శి కృష్ణుడు, ఏఐఎస్ఎఫ్జిల్లా, ఉపాధ్యక్షుడు వంశి, నగర అధ్యక్ష కార్యదర్శులు మంజునాథ్, ఉమామహేష్ ,ఏఐవైఎఫ్ నగర కార్యదర్శి మోహన్, ఏఐఎస్ఎఫ్ నాయకులు చందు హరిక్రిష్ణ ఆనంద్ ఆనంద్ కుమార్ హర్ష పవన్ సమీర్ అశోక్ హర్ష పాల్గొన్నారు.