Sunday, October 27, 2024
Sunday, October 27, 2024

నేడే కౌన్సిల్ సమావేశం

చైర్పర్సన్ కె. లక్ష్మి, మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్
విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో రెండవ తేదీ మంగళవారం ఉదయం 11 గంటలకు కౌన్సిల్ సమావేశమును నిర్వహిస్తున్నట్లు చైర్పర్సన్ కె. లక్ష్మి, మున్సిపల్ కమిషనర్ రామ్కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అజెండాలోని ఆరు అంశాలపై కౌన్సిల్లో చర్చించి తీర్మానం చేయడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా పట్టణంలోని వాడులలో గల సమస్యలపై కూడా చర్చించడం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం డయేరియా వ్యాధులు పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలపై చర్చించుట, కళా జ్యోతి సర్కిల్ జేజేఆర్ నగర్ నందు కొత్తగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ పక్కన స్థలం అన్యాక్రాంతం కాకుండా అదనంగా నిర్మించిన నాలుగు షాపు రూములు మున్సిపల్ ఆర్థిక ప్రయోజనాల నిమిత్తం నిర్మించడమైనదని తెలిపారు. అదేవిధంగా మార్చి 19వ తేదీన నెలసరి అధ్య ప్రాతిపతకన బహిరంగ వేళము మూడు రూములకు నిర్వహించడం జరిగిందని, మూడు సంవత్సరాల కాలం పాటు లీజుకు ఇవ్వడం జరుగుతుందన్నారు. మృతి చెందిన పారిశుద్ధ్య కార్మికులు పై చర్చ, పలువు వార్డులలో కాలువలు మురికి నీరు రోడ్డు పైకి వచ్చి నిలబడి,చాలా ఇబ్బందులు కలుగుతున్న దృష్ట్యా నూతన కాలువ ఏర్పాటు గూర్చి, తదితర విషయములను చర్చించి కౌన్సిల్ ద్వారా ఆమోదం పొందడం జరుగుతుందని వారు తెలిపారు. కావున కౌన్సిలర్లు సకాలంలో హాజరు కావాలని వారు కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img