రక్త బంధం ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు కన్నా వెంకటేష్
విశాలాంధ్ర – ధర్మవరం : రక్తదానం మరొకరికి ప్రాణదానం అవుతుందని రక్త బంధం ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు కన్నా వెంకటేశ్వర్ కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అత్యవసర సమయాలలో, ప్రమాద సమయాలలో మన రక్తదానం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఇందులో భాగంగా సోమవారం అనంతపురం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో జీవన్ కిషోర్ అనే వ్యక్తికి జ్వరము వలన ప్లేట్ రేట్స్ పూర్తిగా తగ్గిపోవడంతో తాను ఆ వ్యక్తికి అవసరమైన ప్లేట్లెట్స్ ను ఇవ్వడం జరిగిందని వారు తెలిపారు. ఇప్పటివరకు 20 సార్లు రక్తదానము, 13 సార్లు ప్లేట్లెట్స్ మొత్తం 33 సార్లు రక్తదానం చేయడం నాకెంతో సంతోషాన్నిచ్చిందని, నా రక్తం పలువురికి ప్రాణదానం కావడం అంటే నా పునర్జన్మ సుకృతం అని వారు తెలిపారు. మున్ముందు నా రక్త బంధం ఆర్గనైజేషన్ ద్వారా రక్త దానంతో పాటు ప్లేట్లెట్స్ కూడా పూర్తి దశలో అవసరమైన వారికి అందిస్తానని వారు తెలిపారు. పట్టణ ప్రజలు కూడా కన్నా వెంకటేష్ చేస్తున్న సేవా కార్యక్రమాలను పట్ల అభినందిస్తున్నారు.