విశాలాంధ్ర – ధర్మవరం : ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం వారు విద్యార్థుల నుండి ఫీజులు వసూలు చేయాలని ఎంఈఓలు..గోపాల్ నాయక్, రాజేశ్వరి దేవి లు తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం వారు మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం వారు ప్రతి తరగతికి ఫీజు వసూలు వివరాలు నోటీసు బోర్డులో పెట్టాలని తెలిపారు. అర్హత కలిగిన ఉపాధ్యాయులను మాత్రమే నియమించి, చక్కటి బోధన ఉండేలా చూడాలన్నారు. విద్యార్థులకు తగిన సదుపాయాలు కల్పించాలని తెలిపారు. ప్రభుత్వ నియమ నిబంధనలు ఉల్లంఘించినచో ఆ ప్రైవేట్ పాఠశాల గుర్తింపు విధిగా రద్దు చేయబడుతుందని హెచ్చరించారు.