మూడు సంవత్సరాలుగా తిరుగుతున్న ఇవ్వలేదు
విశాలాంధ్ర -తనకల్లు : నా అనుభవంలో ఉన్న నా భూమికి పాస్బుక్ మంజూరు చేసి న్యాయం చేయాలని మండల పరిధిలోని బాలసముద్రం గ్రామానికి చెందిన పులి కంటి నరసింహులు తాసిల్దార్ కార్యాలయం ముందు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు నా అనుభవంలో ఉండి మూడు సంవత్సరముల నుండి ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న నాకు పాసుబుక్కులు మంజూరు చేయలేదని కారణాలేమో తెలిపే వారే లేరన్నారు. మా పెద్దల నుండి సంక్రమించిన పట్టా భూమికి పాసుబుక్కు మంజూరు చేయడానికి మూడు సంవత్సరాలు అయినా సమస్య పరిష్కారం కాలేద న్నాడు ఇప్పటికైనా అధికారులు స్పందించి నా రికార్డులను పరిశీలించి నాకు పాసుబుక్ మంజూరు చేయాలని కోరాడు.