ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి
విశాలాంధ్ర – ధర్మవరం : పచ్చని చెట్లు-ప్రగతికి మెట్లు అని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని పుట్టపర్తి రోడ్ పోతుల నాగేపల్లి లో గల జగనన్న కాలనీలో గురువారం” జగనన్న హరిత నగరాలు”అనే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ కాచర్ల లక్ష్మి,మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న పట్టణంలోని వార్డు కౌన్సిలర్లు, వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే తో పాటు మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ అందరూ కలిసి మొక్కలను పంపిణీ చేస్తూ నాటడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ జగనన్న హరిత నగర అనే కార్యక్రమాలను నియోజకవర్గ వ్యాప్తంగా అనుకూలమైన ప్రదేశాలయందు తప్పక మొక్కలను నాటి వాటిని సంరక్షిస్తూ విజయవంతం చేయాలని తెలిపారు. ప్రతి ఇంటి ఆవరణములో రెండు మొక్కలు నాటాలని, సచివాలయ కార్యాలయ ఉద్యోగులు ప్రజలందరికీ అవగాహన కల్పించి మొక్కల నాటే కార్యక్రమాన్ని బాధ్యతగా తీసుకోవాలన్నారు. నేడు పోతుల నాగేపల్లి లేఅవుట్లో 3,500 మొక్కలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. మొక్కలు నాటడం వల్ల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు చంద్మూరి నారాయణరెడ్డి,మాసపల్లి సాయికుమార్, చింత మారుతి, చెలిమి పెద్దన్న, పెనుజూరు నాగరాజు, గజ్జల శివ, వార్డు ఇన్చార్జిలు కాచర్ల అంజి, సుభాన్ భాష, ఉడుముల రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.