విశాలాంధ్ర-పెనుకొండ : పెనుకొండ పట్టణము నందు గురువారం భారత రత్న, అణ్ శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఏడవ వర్ధంతిని పురస్కరించుకొని.
పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద నిర్మించిన అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు నివాళులర్పించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ పొగాకు రామచంద్ర, మాట్లాడుతూ యావత్ భారతదేశం గర్వించదగ్గ మహనీయుడు అబ్దుల్ కలాం ఆయన స్ఫూర్తితో ఎందరో విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలని, దేశ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా రాష్ట్రపతి పాలనను అభివర్ణించారు, ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రీనివాసులు, పాత్రికేయులు రవూఫ్, లాయర్ శివకుమార్, హరి, భాష, రామాంజనేయులు, వెంకటేశులు తదితరులు పాల్గొన్నారు.