విశాలాంధ్ర – ధర్మవరం:: శ్రీ సత్య సాయి జిల్లాలోని లేపాక్షి మండలం చోళ సముద్రంలో భద్రపరిచిన 2024 ఎన్నికలకు సంబంధించిన ఈవీఎంల స్ట్రాంగ్ రూములను ధర్మవరం బిజెపి, జనసేన, తెలుగుదేశం, బలపరిచిన ఉమ్మడి ఎన్ డి ఏ ఎమ్మెల్యే అభ్యర్థి బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకుమార్ యాదవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక బిజెపి నాయకులు స్వాగతం పలికారు. అనంతరం అక్కడ భద్రపరిచిన ఈవీఎంలకు బందోబస్తు తదితర వివరాలను అక్కడి అధికారులతో అడిగి తెలుసుకున్నారు. ఈ స్ట్రాంగ్ రూములను మరింత పటిష్టంగా బందోబస్తు ఏర్పాటు ఏర్పాటు చేయాలన్నారు. జూన్ 4వ తేదీన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు చోళ సముద్రంలోనే వెలువడు ఉన్నాయని తెలిపారు. వీరి వెంట బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ సెంట్రల్ సీడ్ డైరెక్టర్ రమేష్ రెడ్డి, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి అమర్ దేవేంద్ర, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు రవితేజ రెడ్డి, లేపాక్షి మండల అధ్యక్షులు నరసింహమూర్తి, హిందూపురం టౌన్ అధ్యక్షులు నగేష్ స్వామి, వార్డు మెంబర్ శంకర్, అమర్నాథ్ బీజేవైఎం టౌన్ అధ్యక్షులు జయకృష్ణ, లేపాక్షి బీజేవైఎం అధ్యక్షులు రాజు, సాయి, నరసింహ తదితరులు పాల్గొన్నారు.