రూ.10 వేలు విరాళం అందజేసిన:షేక్ బాబ్జాన్
విశాలాంధ్ర,ఎన్ పి కుంట: మండల కేంద్రానికి సమీపంలో ఉన్న కొత్త రోడ్డు వద్ద ప్రకృతి రమణీయమైన సువిశాల పాపాఘ్ని నది తీరాన వెలసిన శ్రీ శ్రీ కావమ్మ,మారయ్య మహోత్సవ కార్యక్రమానికి శుక్రవారం అంకురార్పణ చేయడం జరిగిందని ఆలయ కమిటీ సభ్యులు అంకురార్పణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర బిజెపి మైనార్టీ మోర్చా కార్యవర్గ సభ్యులు షేక్ బాబ్జాన్ హాజరై కావమ్మ మారయ్య తిరుణాల ఉత్సవాలకు భూమి పూజ చేశారు. అమ్మవారి ఆలయం వద్ద ప్రతి ఏటా ఉత్సవాలను అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో అన్ని హంగులతో జరిగే తిరణాల మహోత్సవ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ద్వజ స్తంభం నిలుపు చేసి ఉత్సవాల నిర్వహణకు భూమిపూజను ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలకు అంకురార్పణ కార్యక్రమంలో భాగంగా కావు మారయ్య ఆలయం సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవాల నిర్వహణ లో భాగంగా ధ్వజస్తంభం ఏర్పాటుకు బిజెపి రాష్ట్ర మైనార్టీ మోర్చా కార్యవర్గ సభ్యులు షేక్ బాబ్జాన్ ముఖ్యఅతిథిగా హాజరై భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కావమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరి మీద ఉండాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసినట్లు బిజెపి నాయకులు బాబ్జాన్ వివరించారు.తిరుణాల మహోత్సవ ఉత్సవాల నిర్వహణకు తనవంతుగా రూ.10 ను ఆలయ కమిటీ సభ్యులు అందించారు. కావమ్మ మారయ్య తిరుణాలను ఈనెల 12 నుంచి 15వ తేదీ వరకు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు బాబ్జాన్ ను సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో మండల ఓబీసీ మోర్చా అధ్యక్షులు రమణ, మండల మైనారిటీ మోర్చా అధ్యక్షులు చాంద్ బాషా పాల్గొన్నారు.