మున్సిపల్ చైర్ పర్సన్ కాచర్ల లక్ష్మి
మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న
విశాలాంధ్ర ధర్మవరం:: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర (ఇది అందరి ఆట) అనే కార్యక్రమాన్ని పట్టణంలోని బిఎస్సార్ మున్సిపల్ ఉన్నత పాఠశాల గ్రౌండ్లో వాలీబాల్ క్రీడలు, తదుపరి రేగాటిపల్లి రోడ్డు జీవానంద ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లో మహిళల కోకో క్రీడలను వారు ప్రారంభించారు. తొలుత క్రీడాకారులతో పరిచయం చేసుకొని వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్ కా చర్ల లక్ష్మి, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న మాట్లాడుతూ ఈ క్రీడలు ఈనెల 26 నుండి ఫిబ్రవరి 10 వరకు 47 రోజులు పాటు క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, కోకో, బ్యాడ్మింటన్ డబుల్స్ అనే క్రీడలు నిర్వహించబడును అని తెలిపారు. ఈ క్రీడలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లా నల్లపాడు లో లాంఛనంగా ప్రారంభించడం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. నియోజకవర్గ స్థాయి నుండి జిల్లా స్థాయి, రాష్ట్రస్థాయిలలో పోటీలు ఉంటాయన్నారు. ప్రతిభ చూపిన క్రీడాకారులకు ఆకర్షణీయమైన నగదు తో పాటు ప్రోత్సాహక బహుమతులు కూడా పంపిణీ చేయబడును తెలిపారు. క్రీడల ద్వారా గ్రామస్థాయి నుండి ఆరోగ్యకరమైన జీవ సైలని ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు. ప్రతిభను గుర్తించి, మట్టిలో మాణిక్యాలను కనుగొని, జాతీయ, అంతర్జాతీయ స్థాయి వరకు పోటీకి తీర్చిదిద్దామే మా లక్ష్యం అని తెలిపారు. దీంతోపాటు క్రీడాకారులకు క్రీడా స్ఫూర్తిని మరింత పెంపొందించడం జరుగుతుందని వారు తెలిపారు. నాడు జరిగిన వాలీబాల్ క్రీడా పోటీల్లో మారుతీ నగర్ సచివాలయ పరిధిలోని వారిలో ఏ- టీం, బి. టీం తల పడగా ఏ- టీము.. నాగరాజు విజేత అదేవిధంగా కోకో మహిళల క్రీడా విభాగంలో 15వ వార్డు పరిధిలో ఏ, సి టీములు తలపడగా ఏ. టీం విజేత కావడం, తదుపరి బి, డి టీములు తలపడగా డీ. టీం విజేత కావడం జరిగిందన్నారు.ఈ క్రీడలు గ్రామ/ వార్డు సచివాలయ పరిధిలో ఈనెల 26 నుండి జనవరి 9 వరకు, మండల స్థాయిలో జనవరి 10 నుండి 23 వరకు, నియోజకవర్గ స్థాయి జనవరి 24 నుండి 30 వరకు. జిల్లాస్థాయి జనవరి 31 నుండి ఫిబ్రవరి 5 వరకు, రాష్ట్రస్థాయి పోటీలు ఫిబ్రవరి 6 నుండి 10వ తేదీ వరకు ప్రభుత్వ షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తామని తెలిపారు. కావున ఇటువంటి క్రీడా కార్యక్రమాలను ఆసక్తి గల క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి,వార్డు కౌన్సిలర్ భాగ్యలక్ష్మి, శారద, జిలాన్ భాష పెనుజూరు నాగరాజు, పీఈటీలు లక్ష్మీనారాయణ లక్ష్మీపతి, హెచ్ఎం రాంప్రసాద్, ఎంఈఓ. గోపాల్ నాయక్, జీవానంద కరస్పాండెంట్ రాధాకృష్ణ, జాయి కలందర్, సచివాలయ, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.