విశాలాంధ్ర అనంతపురం : రజక వృత్తిదారుల సమాఖ్య ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు లింగమయ్య సోమవారం రజక సోదరులను కలిసి మంగళవారం బీసీ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న ధర్నా ను విజయవంతం చేయాలని కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా రజక వృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర కార్యనిర్వక అధ్యక్షులు లింగమయ్య మాట్లాడుతూ… రజకులను టు డోర్ టు డోర్ కరపత్రాలు పంపిణీ చేసి మనకు రావలసిన హక్కులను కాపాడుకోవాలని దానికోసమే బిసి కార్పొరేషన్ దగ్గర రేపు జరిగే ధర్నాను రజకులను జయప్రదం చేయాలని పిలుపునివ్వడం జరిగిందన్నారు. రజకులకు గ్రామీణ ప్రాంతాలలో దోబీ ఘాటు లేక నీట్ సౌకర్యం లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు బట్టలు ఉతికి ఇవ్వాలంటే ఎంత కష్టంగా ఉందో అది ప్రభుత్వం అర్థం చేసుకోలేక పోతుంది ఈ ప్రభుత్వమే నా బీసీ కార్పొరేషన్ కి నిధులు ఇచ్చి రజకులకు రావలసిన కనీస అవసరాలున్న కల్పించాలని రేపు జరిగే ధర్నాను విజయవంతం చేస్తామని రజకులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రజక వృత్తిదారుల సమాఖ్య జిల్లా కార్యదర్శి సివిహరి కృష్ణ జిల్లా ఉపాధ్యక్షుడు నాగప్ప, తదితరులు పాల్గొన్నారు