విశాలాంధ్ర-పెనుకొండ : మండల పరిధిలోని గుట్టుర్టు సచివాలయం నందు జరిగిన ఁజగనన్న సురక్షఁ కార్యక్రమానికి గురువారం నియోజకవర్గ శాసనసభ్యులు మాలగుండ్ల శంకర నారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొని కొత్తగా మంజూరైన కొత్త రేషన్ కార్డులు మరియు ప్రధాన ధృవీకరణ పత్రాలను లబ్ధి దారులకు పంపిణీ చేసారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ నాగరత్నమ్మ, జెడ్పీటీసీ, శ్రీరాములు, ఎంపిపి, గీతా రామ మోహన్ రెడ్డి ఎంపిటిసిలు నిర్మలా నారాయణస్వామి, మండల స్పెషల్ ఆఫీసర్ పద్మమ్మ, తాసిల్దార్ స్వర్ణలత, ఎంపీడీవో శివశంకరప్ప, కొండల రాయుడు, శ్రీనివాసులు స్తానిక ప్రజా ప్రతినిధులు, వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు, సర్పంచులు, కార్యకర్తలు, సచివాలయం కన్వీనర్, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, గృహ సారథులు, తదితరులు పాల్గొన్నారు.