విశాలాంధ్ర -జేఎన్టీయూ ఏ: ప్రభుత్వ నిబంధనల గాలికి వదిలేసి నారాయణ విద్యా సంస్థలు కొత్త సమయపాలన రూపు కల్పన చేశారని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కుల్లాయి స్వామి చిరంజీవి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనల ఉదయం 9:00 నుండి సాయంత్రం 4:30 గంటల వరకు మాత్రమే విద్యాసంస్థలు నిర్వహించాలి ఆ నిబంధనలను తుంగలో తొక్కుతూ విద్యార్థులను ఒక యంత్రంలాగా తయారు తయారుచేసి ఉదయం 8 గంటల నుండి రాత్రి 8:30 గంటల వరకు నిర్వహిస్తున్నారు. జెడ్ ఎఫ్, టివి ,ఐఐటి, జేఈఈ మెయిన్స్ పేరుతో విద్యార్థుల నుండి లక్షల రూపంలో ఫీజులు వసూలు చేస్తున్న నారాయణ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థులను మానసికంగా క్రీడా మైదానాలు లేకుండా విద్యార్థులకు ఆటలు లేకుండా విద్యార్థులను ఒక యంత్రంలా తయారు చేస్తున్నారు. ఆర్ ఐ ఓ నారాయణ విద్యాసంస్థలపై చర్యలు చేపట్ట లేకపోతే రాజీనామా చేసి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిబంధనల సమయపాలన అనుసరించను క్రమంలో విద్యాసంస్థల ఎదుట ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమవుతామని తెలిపారు.