విశాలాంధ్ర- పెనుకొండ : పెనుకొండ నియోజకవర్గం నందు మంగళవారం నాటికి 147వ రోజు ఐదు రూపాయలకే పేదవారికి కడుపునింపే అన్న క్యాంటీన్ నిర్వహణ జరిగిందని అన్నా క్యాంటీన్ నిర్వహకురాలు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత మాట్లాడుతూ పేదలకు పట్టెడు అన్నం పెట్టగలిగిన నాడే దేశానికి నిజమైన స్వాతంత్రం అంటూ రెండు రూపాయలకు కిలో బియ్యం పథకంతో ప్రారంభించి ఎన్టీఆర్ అమలు చేసిన ఎన్నో సంక్షేమ పథకాలు దేశంలో సంక్షేమ పాలనకు బీజం వేశాయి. తెలుగుదేశం ప్రభుత్వంలోఅన్నా క్యాంటీన్లకు స్ఫూర్తి ఈ వాక్యమే అని ఆమె తెలిపారు ఆమె తన చేతులతో పేదవారికి చేతగాని వారికి అన్నాన్ని వడ్డించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.