రక్త బంధం ఆర్గనైజేషన్ అధ్యక్షులు కన్నా వెంకటేష్.
విశాలాంధ్ర ధర్మవరం:: మన రక్తదానం మరొకరికి ప్రాణదానం అవుతుందని రక్త బంధం ఆర్గనైజేషన్ అధ్యక్షుడు కన్నా వెంకటేష్ తెలిపారు. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గానికి చెందిన నాగవేణి అనే చిన్నారికి డెంగ్యూ జ్వరం రావడం వలన ఆ చిన్నారి అనంతపురం మెడికేర్ అను ప్రైవేటు హాస్పిటల్ లో అడ్మిషన్ అయింది. సమాచారం తెలుసుకున్న కన్నా వెంకటేష్ తెల్ల రక్త కణాలు కావాలని వైద్యులు తెలుపగా సోషల్ మీడియా ద్వారా తెలిసిన వెంటనే అనంతపురం దీపు బ్లడ్ బ్యాంకుకు వెళ్లి 39వ సారి ప్లేట్స్ ఇవ్వడం జరిగిందని వారు తెలిపారు. ఇప్పటివరకు రక్త బంధం ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పలు రక్త శిబిరాలు నిర్వహించామని, ప్రత్యక్షంగా పరోక్షంగా 4000 మందికి పైగా రక్తదానం చేయడం జరిగిందని వారు తెలిపారు. అలాగే ప్రస్తుతం చలికాలం వలన డెంగ్యూ మలేరియా వంటి వ్యాధులు అధికంగా రావడం వలన చాలామంది చిన్నారులు ప్లేట్లెట్స్ డౌన్ అవ్వడం వలన హాస్పిటల్ లో అడ్మిషన్లు అధికమవుతున్నాయని తెలిపారు. కావున యువతి యువకులు అందరూ రక్తదానం చేయాలని వారు కోరారు. తదుపరి నాగవేణి కుటుంబ సభ్యులు బ్లడ్ బ్యాంకు సిబ్బందికి, కన్నా వెంకటేష్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.