విశాలాంధ్ర – అనంతపురం : అనంతపురం నగరంలోని జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో చెట్లు, మొక్కల పెంపకం చేపట్టాలని, పరిసర ప్రాంతాలన్నీ పచ్చదనంతో కళకళలాడాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ ఆదేశించారు. బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయం, జాయింట్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, డిఆర్ఓ క్యాంప్ కార్యాలయాల ఎదురుగా మెయిన్ రోడ్డు వరకు చేపట్టిన మొక్కల పెంపకాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించి, ఎంపిక చేసిన వివిధ రకాల మొక్కలను నాటాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్ మేఘ స్వరూప్, హార్టికల్చర్ ఏడి లక్ష్మీప్రసన్న, తహసిల్దార్ శివరామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.