వాహనాల తనిఖీలు ముమ్మరం
విశాలాంధ్ర – అనంతపురం : కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యేందుకు మరికొన్ని గంటలు మాత్రమే వ్యవధి ఉండడంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. అనుమానితులు, అనవసరమైన వ్యక్తులు కౌంటింగ్ జరిగే జిల్లా కేంద్రంలోకి తరలివచ్చి ఏవైనా అవాంఛనీయ ఘటనలకు పాల్పడే అవకాశం ఉండకూడదనే ముందస్తు జాగ్రత్తలలో భాగంగా జిల్లా ఎస్పీ గౌతమిశాలి ఐపీఎస్ ఆదేశాల మేరకు పోలీసులు వాహనాలు తనఖీ ముమ్మరం చేశారు. అనంతపురం లోపలికి వచ్చే మార్గాలు అన్నింటిలోనూ ఆయా పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. సాధారణ ప్రజలకు ఎలాంటి ఆటంకం, అసౌకర్యం కలిగించకుండా తనిఖీలు కొనసాగుతున్నాయి. అనుమానితులు, నేరచరిత కలిగిన వారు, ఇదివరకే గొడవలు, అల్లర్లు, హింసాత్మక ఘటనల్లో పాల్గొన్న వ్యక్తులు ఎవరిని జిల్లా కేంద్రంలోనికి రాకుండా చెకింగ్ చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోకి వచ్చే రహదారులపైనే కాకుండా ఆర్టీసీ బస్టాండు, రైల్వే స్టేషన్ మరియు ప్రధాన కూడళ్ళు, రహదారులపై కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అక్రమంగా మారణాయుధాలు, పేలుడు పదార్థాలు, మద్యం… ఇలా ఏవి తరలించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.