విశాలాంధ్ర-తాడిపత్రి: మున్సిపల్ కార్మిక సమస్యలపై రిలే దీక్షలు నిర్వహిస్తున్నామని సిఐటియు పట్టణ అధ్యక్షుడు రామాంజ నేయులు సోమవారం మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల సమస్యలపై ఈనెల 20,21వ తేదీన మహిళ కార్మికులచే, ఇంజనీరింగ్ పారిశుద్ధ్య, అండర్ డ్రైనేజీ కార్మికుల రిలే దీక్షలు చేస్తున్నామన్నారు. అలాగే ఈనెల 27వ తేదీన మున్సిపల్ కార్యాలయం ముట్టడి ఆగస్టు 7వ తేదీన చలో కలెక్టరేట్ నిర్వహిస్తామన్నారు. అప్పటికి మున్సిపల్ కార్మికుల సమస్యలు ప్రభుత్వం నెరవేర్చకపోతే ఆగస్టు 15వ తేదీన రాష్ట్ర వ్యాప్త సమ్మెకు రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది . కావున కార్మికులు చేసే పలు కార్యక్రమా.లకు అనుమతులు మంజూరు చేయాలని కమిషనర్ను కోరారు. సిఐటియు ఇంజనీరింగ్ విభాగం అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శి జుబేర్, ఓబయ్య, జి.పి.ప్రసాద్, హరికృష్ణ, మహబూబ్ బాషా పారిశుద్ధ్య కార్మికులు శంకర్, సాయి కృష్ణ, నారాయణ, రాముడు పాల్గొన్నారు.