విశాలాంధ్ర-గుంతకల్లు : మండలంలో కళాకారులకు కళాక్షేత్రాన్ని నిర్మించాలని సోమవారం ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వై.వెంకట్రాంరెడ్డి నివాసానికి వెళ్లి ఆయనకు కళాకారులు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో శుభోదయం ఆర్ట్స్ సభ్యులు జి.బి.ఎం. చలపతి, పద్మశ్రీ ఘంటసాల కల్చరల్ సభ్యులు పి.సి.కుళ్లాయప్ప ,శ్రీ వెంకటేశ్వర కళానికేతన్ సభ్యులు భగవంతుప్ప, లక్ష్మీపతి,పరంజ్యోతి నాటక కళా సమితి సభ్యులు పరంధామయ్య, ఘంటసాల ఆర్కెస్ట్రీ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, గొప్ప కళాకారులు రైల్వే ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఇన్చార్జ్ ప్రిన్సిపల్ సుధాకర్, ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి పట్టణ కార్యదర్శి పుల్లయ్య పాల్గొన్నారు.