విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని ఓ పేద కుటుంబానికి చెందిన రజిని అనాధాశ్రమంలో జీవనం చేస్తూ ఉండేది, అనుకోకుండా రజినీకి కిడ్నీ సమస్య రావడం తో అనంతపురం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటుంది. రజినికి అమ్మ నాన్న కూడా ఎవరూ లేకపోవడంతో అనాధగా బతుకుతుంది. సమాచారం తెలుసుకున్న ప్రముఖ చేనేత వ్యాపారి సంధ రాఘవ తారక్ చేయుట ట్రస్ట్ ద్వారా వైద్య ఖర్చుల నిమిత్తం ఎనిమిది వేల రూపాయలను ఆర్థిక సహాయాన్ని వారు అందజేశారు. ఈ సందర్భంగా తారక్ చైత ట్రస్ట్ అధ్యక్షులు రామాంజి రాఘవకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం రామాంజి మాట్లాడుతూ అనంతపురం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో ప్రస్తుతం రజిని చికిత్స పొందుతోందని, వారంలో మూడు రోజులకు ఒకసారి డయాలసిస్ చేసుకోవడం జరుగుతుందన్నారు. అనంతరం ఇన్ఫెక్షన్ కావడంతో హాస్పిటల్లో అడ్మిట్ కావడం జరిగిందన్నారు. ఒక పేదరాలిని ఆదుకోవడం నిజంగా సంతోషకరమన్నారు. ఇప్పటికే సంద రాఘవ ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించి, ప్రజల మన్ననలు పొందుతున్నారని తెలిపారు.