విశాలాంధ్ర- ఉరవకొండ : ఉరవకొండ పట్టణంలో బూత్ నెంబర్ 119 లో ఓటర్లు జాబితాను గురువారం బిఎల్ఓ తో పాటు టిడిపి పార్టీ నాయకులు పరిశీలించారు. ఈ బూత్ పరిధిలో మరణించిన వారి వివరాలు, దొంగ ఓట్లు ఏమైనా ఉన్నాయా, వీటితో పాటు మార్పులు చేర్పులు కొత్త ఓటర్ల నమోదు తదితర అన్ని అంశాలను కూడా వీరు పూర్తిస్థాయిలో పరిశీలించారు. ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆదేశాలతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలుగుదేశం పార్టీ నాయకులు బూత్ కన్వీనర్ మరియు వార్డు సభ్యులు మీనుగా రామాంజనేయులు, తెలిపారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏ రాముడు, బిఎల్వోలు పాల్గొన్నారు