విశాలాంధ్ర- ఉరవకొండ :ఉమ్మడి చిత్తూరు జిల్లా పుంగనూరులో మాజీ ముఖ్యమంత్రి టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు పర్యటనను వైసీపీ నాయకులు అడ్డుకుని పార్టీ నాయకులు కార్యకర్తలపై దాడులు చేసినందుకు నిరసనగా శనివారం ఉరవకొండలో తెలుగుదేశం పార్టీ నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానిక పార్టీ కార్యాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వద్ద ర్యాలీ నిర్వహించారు. టిడిపి నాయకుల ర్యాలీని పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు