విశాలాంధ్ర, ధర్మవరం:: ధర్మవరం నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్యలో మహిళల సంఖ్య అధికంగా ఉంది. మొత్తం ఓటర్ల సంఖ్య 2,45,758 కాగా, వీరిలో పురుషుల సంఖ్య 1,21,764 మంది, మహిళల సంఖ్య 1,23,974 మంది, ఇతరులు 20 మంది కలరు. నియోజకవర్గంలో పోలింగ్ బూతులు 287 కలవు. ఈనెల 13న జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మహిళలే కీలక పాత్ర వహించనున్నారు. అటు ఎన్ డి ఏ అభ్యర్థి సత్య కుమార్ యాదవ్, వైఎస్ఆర్సిపి పార్టీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంగనాథ నారాయణ పోటాపోటీగా తమ ప్రచారాలను కొనసాగిస్తున్నారు. ఈ ప్రచారాలు ఈనెల 11న సాయంత్రం ఐదు గంటలకు ముగియనున్నాయి.