సిల్క్ హౌస్ యజమానులు
విశాలాంధ్ర – ధర్మవరం : కొన్ని రోజుల కిందట విజయవాడలో ధర్మవరం వ్యాపారస్తులపై జరిగిన దాడి అమానుషమని, వీటిని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఐక్యంగా ఉండి సమస్యలను ఎదుర్కొంటామని సిల్క్ హౌస్ యజమానులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా శనివారం శనినారాయణ స్వామి దేవాలయంలో పట్టణ సిల్క్ హౌస్ యజమానులు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పలు సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణను రూపొందించడం జరిగింది. విజయవాడ ఘటనపై పలువురు సిల్క్ యజమానులు తీవ్రంగా ఖండించారు. అనంతరం సిల్క్ హౌస్ యజమానులు మాట్లాడుతూ ధర్మవరం వ్యాపారస్తులు అప్పులు ఇచ్చినా కూడా వారి చేతిలో అవమాన పడాల్సిన పరిస్థితి రావడం దారుణమన్నారు. చీరలు ఇచ్చి… డబ్బులు అడగడం వ్యాపారస్తుని యొక్క మొదటి కర్తవ్యం వారి గుర్తు చేశారు. ఇకనుంచి పట్టణంలోని వ్యాపారస్తులందరూ కూడా ఐక్యమత్యంతో ప్రతి సమస్యను పరిష్కరించుకునేలా తాము చర్యలు చేపడతామని తెలిపారు. అంతేకాకుండా ఒక అసోసియేషన్ను ఏర్పాటు చేసుకొని తద్వారా ఏ సమస్య వచ్చినా పరిష్కరించుకునేలా తాము చర్యలు చేపడతామని తెలిపారు. ధర్మారం వ్యాపారస్తులపై విజయవాడ ఆలయ సిల్క్ హౌస్ అధినేత అవినాష్ చేసిన దాడికి నిరసనగా ఈనెల పదవ తేదీ నుంచి 17వ తేదీ వరకు వారం రోజులు పాటు వస్త్ర దుకాణాలను బంద్ చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు.. అంతేకాకుండా వ్యాపారస్తులు అందరూ కూడా కలిసికట్టుగా విజయవాడకు వెళ్లి అవినాష్ షాపు వద్ద ధర్నా నిర్వహించడం, స్థానిక డిఎస్పి కి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చీరలు కొనుగోలు చేసే విజయవాడ వ్యాపారస్తులుతో మున్ముందు మా సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిల్క్ హౌస్ యజమానులు, పట్టు వ్యాపార సంస్థల యజమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.