పట్టు చీరల వ్యాపారస్తుల సంఘం అధ్యక్షులు గిర్రాజు రవి
విశాలాంధ్ర -ధర్మవరం: చేనేత పరిశ్రమను ప్రాణమునంతవరకు రక్షించుకుంటామని పట్టు చీరల వ్యాపారస్తుల సంఘం అధ్యక్షులు, పవర్లూమ్స్ అసోసియేషన్ కార్యదర్శి గిర్రాజు రవి, పవర్ లూమ్స్ అసోసియేషన్ అధ్యక్షులు పోలా వెంకటరమణ పేర్కొన్నారు. జాతీయ చేనేతల దినోత్సవం సందర్భంగా వారి కార్యాలయంలో నలుగురు చేనేత కార్మికులను శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ ధర్మవరం పట్టుచీరలు దేశంలోనే ప్రసిద్ధిగాంచినవని, ఇటీవల ధర్మవరం వ్యాపారస్తులపై విజయవాడ అవినాష్ గుప్తా చేసినటువంటి దాడి, దారుణమని భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఐక్యమత్యంతో తాము పట్టు చీరల వ్యాపారస్తుల సంఘమును స్థాపించడం మాకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.దాడికి పాల్పడిన అవినాష్ గుప్తాను అరెస్టు చేయించడం జరిగిందని, అతని ద్వారా ధర్మారం వ్యాపారస్తులకు రావలసిన బాకీలన్నీ కూడా చట్టపరంగా వసూలు చేస్తామని తెలిపారు. ప్రభుత్వాలు కూడా చేనేత పరిశ్రమ పట్ల మరింత ప్రత్యేక శ్రద్ధను కనపరిచితే చేనేత పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని తెలిపారు. అనంతరం పవర్ లూమ్స్ అసోసియేషన్ కమిటీ వారు గిర్రాజు రవిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అమీర్ భాష, చింతా కృష్ణ, పుత్తా నారాయణస్వామి, పూజారి చౌడయ్య, పూజారి వెంకటరాముడు, చంద్రయ్య, వెంకటరమణ, పళ్ల నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు