ప్రజల ఆరోగ్యానికి రక్షణ కవచం : హోమియో
హానికరం లేని వైద్య విధానం
విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : అవసరం వల్ల రోగికి స్వస్థత చేకూరాలే తప్ప మందుల దుష్ప్రభావంతో మరెన్నో కొత్త సమస్యలు రాకూడదని ప్రభుత్వ సీనియర్ హోమియో వైద్యాధికారి నల్లపాటి తిరుపతి నాయుడు పేర్కొన్నారు. స్థానిక ప్రభుత్వ హోమియో వైద్యశాలలో బుధవారం ప్రపంచవ్యాప్తంగా వైద్యరంగంలో హోమియోపతి పితామహుడు డాక్టర్ క్రిస్టియన్ ఫెడరిక్ శామ్యూల్ హనేమూన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… హోమియోపతి వైద్య విధానాన్ని కనుగొన్న శాస్త్రవేత్త తనపై తన కుటుంబ సభ్యులపై 100కు పైగా పరిశోధనలు ప్రయోగాలను విజయవంతం చేసిన తత్వవేత్త అన్నారు. ఆయన కనిపెట్టిన మందులను చిన్నపిల్లలు తో మొదలుకొని వృద్ధులు దాకా ఎంతో నమ్మకంతో వాడుతున్నారన్నారు. ఆయన జయంతి రోజైనా ఏప్రిల్ 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా హోమియోపతి దినోత్సవం గా జరుపుకోవడం ఆనవాయితీగా నడుస్తోందన్నారు.
హోమియోను దేశీయ వైద్యంగా భావిస్తారు దీర్ఘకాలిక వ్యాధులే కాదు కాలానుగుణంగా జబ్బులను సైతం నేటిగా నాణ్యతగా పనిచేసే వైద్యం ఇది. అల్లోపతి వైద్యంతో నయం కానీజబ్బుల సైతం హోమియోలో స్వస్థత చేకూరిందంటే అతిశయోక్తి కాదేమో ఏటా సీజనల్ గా జనాన్ని ముప్పతిప్పలు పెట్టే మెదడువాపు, స్వైన్ ఫ్లూ, డెంగీ, చికెన్ గునియా, చికెన్ ఫాక్స్,కండ్ల కలక, విష జ్వరాలు, ఇలా ఎన్నో రకాల రోగాలు సోపకుండా హోమియో మందు ముందస్తు రక్షణ కల్పిస్తుందన్నారు. 1998లో జిల్లాను వలికించిన మెదడువేపు మహమ్మారిని అదుపు చేసింది హోమియో మందులను అందించడం జరిగిందన్నారు. పసిపిల్లల ప్రాణాలను రక్షణ కవచం గా నిలిచిందన్నారు. హోమియో బెల్లడోనా అనే ఫీల్ ప్రతి పిల్లాడికి వేశారు. ఆ తర్వాత 2015లో డెంగీ 2016లో స్వైన్ ఫ్లూ వంటి ప్రమాదకర జ్వరాలను అల్లోపతి అదుపు చేయలేకపోయినా హోమియో అడ్డుకట్ట వేసిందన్నారు. జిల్లాలో విరివిగా మందులు అందించడంతో దీంతో ప్రజలకు నమ్మకం భరోసా కలిగిందన్నారు. హోమియో మందులను ఎటువంటి దుష్ప్రభావం లేకుండా ధైర్యంగా వాడవ వచ్చును అల్లోపతి మందులు తింటూనే హోమియోపతి మందులు కూడా వాడవచ్చు అన్నారు. ప్రభుత్వ హోమియోపతి వైద్యశాలలో మందులను అందుబాటులో ఉంచిందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ హోమియో వైద్యశాల ఫార్మసిస్ట్ సుదర్శన్ రెడ్డి, సిబ్బంది శాంతమ్మ, మానవ హక్కుల సంఘం దక్షిణ భారత దేశ కార్యదర్శి ఆవుల ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.