ముంబయి: పయనీర్ కార్పొరేషన్ తాజాగా ఆర్ అండ్ డి ఉనికిని జోడిరచడం ద్వారా భారతదేశంలో తన కార్యకలాపాలను విస్తరించే ప్రణాళికలను ప్రకటించింది. గురుగ్రామ్, బెంగళూరు కార్యాలయంలోని పయనీర్ ఇండియాలో ఆర్ అండ్ డిని స్థాపించడం ద్వారా, పయనీర్ ఆవిష్కరణల సృష్టిని వేగవంతం చేస్తుంది. మొబిలిటీ రంగంలో వినూత్న ఉత్పత్తులు, సేవలను అభివృద్ధి చేయడం, అలాగే ఆర్ అండ్ డిని బలోపేతం చేసే లక్ష్యంతో ఇంజనీర్లను నియమించడం, వారికి శిక్షణ ఇవ్వడంపై దృష్టి సారిస్తుంది. ఇది వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతీయ మార్కెట్తో సహా తమ ప్రపంచ వ్యూహాన్ని మరింత బలోపేతం చేస్తుందని పయనీర్ ప్రెసిడెంట్, సీఈఓ షిరో యహారా తెలిపారు. గురుగ్రామ్లో ఉన్న భారతదేశ ప్రధాన కార్యాలయం, బెంగళూరులోని అదనపు కార్యాలయంలోని ఆర్ అండ్ డి విస్తరణ, ఇన్ఫోటైన్మెంట్, రక్షణ, భద్రతా ఉత్పత్తులు, టెలిమాటిక్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, ద్విచక్ర వాహనాలతో సహా ఆటోమోటివ్ మార్కెట్ కోసం కనెక్ట్ చేయబడిన పరిష్కారాలు వంటి వృద్ధి రంగాలపై దృష్టి సారిస్తుందన్నారు.