బెంగుళూరు: గ్లోబల్ ఫ్యాషన్ రంగానికి మార్గదర్శకత్వం వహిస్తూ, 2024 వేసవికి దాని ప్రసిద్ధ మాక్స్ కిడ్స్ ఫెస్టివల్ ప్రచారాన్ని సగర్వంగా మ్యాక్స్ ఫ్యాషన్ ఆవిష్కరించింది. 14 సంవత్సరాల క్రితం ప్రారంభించినప్పటి నుండి, దేశ వ్యాప్తంగా కుటుంబాలు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమంగా మ్యాక్స్ కిడ్స్ ఫెస్టివల్ ఎదిగింది. దేశంలోని ప్రతిఒక్కరికీ అత్యంత ఇష్టమైన ఫ్యాషన్ బ్రాండ్గా మ్యాక్స్ స్థానాన్ని బలోపేతం చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. నేడు, మ్యాక్స్ మొత్తం అమ్మకాలలో నాలుగో వంతు వాటాను పిల్లల విభాగం కలిగి ఉంది. దేశవ్యాప్త వార్షిక కార్యక్రమం పిల్లలు, యుక్తవయస్కులు తమ సృజనాత్మకతను కళా మాధ్యమం ద్వారా వేడుక చేసుకోవడంపై దృష్టి పెడుతుంది. ఈ సంవత్సరం ఎడిషన్ 21 నగరాలు, 100 కంటే ఎక్కువ మ్యాక్స్ స్టోర్లలో పిల్లలు, యుక్తవయస్కుల కోసం అపూర్వమైన రీతిలో భారతదేశ వ్యాప్త డ్రాయింగ్, కలరింగ్ పోటీని కలిగి ఉంటుంది. మ్యాక్స్ ఫ్యాషన్ ఇండియా హెడ్ మార్కెటింగ్, పల్లవి పాండే మాట్లాడుతూ మ్యాక్స్ కిడ్స్ ఫెస్టివల్ అతిపెద్ద, ఎక్కువమంది ఇష్టపడే వార్షిక బ్రాండ్ ఐపి అని తెలిపారు.