విశాలాంధ్ర- ఉంగుటూరు( ఏలూరు జిల్లా ) : ఉంగుటూరు మండలం నాచుగుంట శివారు కొత్తగూడెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు ఎస్జీటీగా పనిచేస్తున్న కేవీ లక్ష్మీ తండ్రి జ్ఞాపకార్థం వారి అమ్మ కర్రి లక్ష్మి పాఠశాలకు పదివేల విలువైన బీరువా అందజేశారు. ఈ విషయాన్ని గురువారం ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వరరావు తెలియజేశారు. లక్ష్మీ టీచర్ ను పాఠశాల సిబ్బంది, పాఠశాల యజమాన్య కమిటీ అభినందించారు.