Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

ఎన్నాళ్ళీ వివక్షత……?

నిలువుకాళ్ళ పై నిలబడ్డ చాట్రాయి ఎంపీపీ…

విశాలాంధ్ర చాట్రాయి: ఎన్నాళ్ళీ వివక్షతా……? ……75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో … అధికార వైయస్సార్ పార్టీకి చెందిన దళిత మహిళా ప్రజా ప్రతినిధి…. చాట్రాయి మండల పరిషత్ అధ్యక్షురాలు… లంకా నిర్మల నిలువు కాళ్ళపై నిలబడ్డ దృశ్యమది . దళితులు, బలహీన వర్గాలకు చెందిన వారికి చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా తానే రాజకీయ గౌరవం గుర్తింపు ఇస్తున్నానని సాక్షాత్తు జగన్ మోహన్ రెడ్డి ఉదయం ఒక సభలో ప్రకటిస్తే మంగళవారం సాయంత్రానికి వైయస్సార్ పార్టీకి కంచుకోట… చాట్రాయి మండలం బూరుగగూడెం గ్రామంలో…ఏపీ కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్ దేశి రెడ్డి రాఘవరెడ్డి ఆధ్వర్యంలో గడచిన నాలుగు రోజులుగా బూరుగగూడెం గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళ పార్టీ తరపున ఎంపిపి సొంత గ్రామమైన బూరుగగూడెం గ్రామంలో సాధారణ పౌరులు వైసిపి కార్యకర్తలు దేశి రెడ్డి సమక్షంలో కుర్చీలలో కూర్చుంటే ఎంపీపీ లంక నిర్మల మాత్రం జరుగుతున్న సభను చూడటానికి వినడానికి ఒక సాధారణ మహిళ వచ్చినట్లు వచ్చి నిలువు కాళ్ళపై నిల్చోవడం తన వంతు అయింది.కేవలం దేశిరెడ్డి మాత్రమే కాదు ఆ ఫోటో పరిశీలిస్తే అనేక మంది చిన్నా చితకా వ్యక్తులు కుర్చీల్లో కూర్చున్నారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం తప్పనిసరి పరిస్థితుల్లో లెక్కల కోసం దళితులు, దళిత మహిళలు, బలహీనవర్గాలు గిరిజనులు గిరిజన మహిళలను “పొయ్యి కాడ మసిగుడ్డ” మాదిరిగా వాడుతూ అగ్రవర్ణాలు పెత్తందారులు కుల వివక్షతను కొనసాగిస్తున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సందర్భాలలో పెత్తందారీ విధానం సుతిమించిపోయి పెద్ద పెద్ద నాయకులు దళితులు బలహీన వర్గాలకు ప్రజాప్రతినిధులకు కనీసమైన గౌరవం ఇవ్వడం లేదు అనడానికి ఈ ఘటన అద్దం పడుతుందని పలువురు అంటున్నారు.మండలంలో 18 గ్రామ పంచాయతీ వుండగా 16 పంచాయితీ లు మొత్తం ఎంపీటీసీ లు గా జెడ్పీటీసీ గా గెలిచిన వారంతా వైసీపీ వారు కావడం గమనార్హం.చాట్రాయి మండల పరిషత్ సర్వసభ్య సమావేశాల్లో అనేక మంది ప్రజా ప్రతినిధులు మాకు సరైన గౌరవం గుర్తింపు లేదని అనేక సందర్భాల్లో ఆవేదన వ్యక్తంచేశారు.పెత్తందారీ విధానం ఒంటెత్తు పోకడలు తట్టుకోలేని వారు వైసిపి కి గుడ్ బై చెప్పడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.ఒక గ్రామంలో అయితే సర్పంచ్ ఎవరో ఎంపీటీసీ ఎవరో కనీసం అధికారులు కూడా పట్టించుకోని పరిస్థితి నెలకొందని ఎన్నాళ్ళు ఈ కులవివక్షత అంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img