విశాలాంధ్ర- ఉంగుటూరు( ఏలూరు జిల్లా): ఉంగుటూరు ఆయుర్వేద ఆసుపత్రిలో తమిళనాడు నుంచి వచ్చిన వెస్ట్ గోదావరి ఎన్ ఏ బి హెచ్ కమిటీ సభ్యులు డాక్టర్ కొత్త నయోగి, కమిటీ నోడల్ అధికారి డాక్టర్ పి నీలిమ ను శుక్రవారం సన్మానం చేశారు.ఉంగుటూరు సర్పంచి సింధు మధుబాబు ఆధ్వర్యంలో సన్మానం జరిగింది. కార్యక్రమంలో తల్లాప్రగడ భీమేశ్వరరావు, ఆయుర్వేద ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ కస్తూరి శిరీష, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.