Monday, May 20, 2024
Monday, May 20, 2024

ఎవరు నెగ్గిన.. ఎమ్మెల్యే పీఠం నిడమర్రు మండలానిదే..

విశాలాంధ్ర- ఉంగుటూరు : ఉంగుటూరు అసెంబ్లీ నియోజక వర్గంలో గెలిచే పార్టీ రాష్ట్రాన్ని ఏలుతుందనే నానుడి ఉండనే ఉంది. కాగా ఈ సారి ఉంగుటూరు అసెంబ్లీ ఎన్నికల బరిలో అధికార విపక్ష పార్టీల అభ్యర్ధులది ఒకటే మండలం కావడం విశేషం. అదే నిడమర్రు మండలం. ఎన్నికల కోడ్ కూసిన వేళ అభ్యర్థుల ప్రచారం ఊపందుకుంటోంది .కాగా నిడమర్రు మండల వాసుల్లో ఫుల్ జోష్ కానవస్తోంది. అటు వైసీపీ అభ్యర్థి పుప్పాల వాసుబాబు నిడమర్రు మండలంలోని బువ్వనఫల్లికి చెందిన వారు. ఇటు జనసేన ,టిడిపి, బిజెపి ఉమ్మడి అభ్యర్థి పత్సమట్ల ధర్మరాజునిడమర్రు మండలంలోని ఫత్తేపురం వాసి. ఈ ఇద్దరు ప్రధాన అభ్యర్థుల మధ్య ఎన్నికల పోరు రసవత్తరంగా మారనుంది.వారిలో మా వాడే కాబోయే ఎమ్మెల్యే అనే సంబరం కొట్టొచ్చినట్లు కనబడుతోంది.ఈ దశలో మా మండలానిదే ఎమ్మెల్యే పీఠం అంటూ నిడమర్రు మండలం వాసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

    సంబంధిత వార్తలు

    spot_img

    తాజా వార్తలు

    spot_img