డివిజన్ కార్యదర్శికి సురేష్ రెడ్డి శుభాకాంక్షలు
విశాలాంధ్ర-కుత్బుల్లాపూర్ : ప్రజల మన్ననలు పొందేలా డివిజన్ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి సూచించారు. ఈ మేరకు బిఆర్ఎస్ నాయకులు 130 డివిజన్ ప్రధాన కార్యదర్శి శివాజీ జన్మదిన వేడుకల సందర్బంగా సురేష్ రెడ్డి శాలువాతో సత్కరించారు.అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.