సర్రే: కెనడాలో నివసిస్తున్న భారతీయుడు యువరాజ్ గోయల్ (28) హత్యకు గురయ్యారు. కొందరు దుండగులు ఆయనపై కాల్పులు జరపడంతో ప్రాణాలు కోల్పోయారు. జూన్ 7న ఈ ఘటన జరిగినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. యువరాజ్ది పంజాబ్లోని లూథియానా. ఉన్నతచదువులు నిమిత్తం 2019లో ఆయన కెనడా వెళ్లారు. ప్రస్తుతం సేల్స్ ఎగ్జిక్యూటివ్గా ఉద్యోగం చేస్తున్నారు. ఇటీవల కెనడాలో శాశ్వత నివాస హోదా లభించింది. ఈ క్రమం లోనే శుక్రవారం బ్రిటిష్ కొలంబియాలోని సర్రే ప్రాంతంలో కాల్పులు జరిగినట్లు పోలీసులకు సమాచారం అందింది. వారు అక్కడికి చేరుకొని యువరాజ్ మృతదేహాన్ని గుర్తించారు. ఈ ఘటనలో నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని, విచారిస్తున్నారు. మృతుడికి ఎలాంటి నేర చరిత్ర లేదని వెల్లడిరచారు.