Tuesday, October 29, 2024
Tuesday, October 29, 2024

ఇరాన్‌ సైనిక స్థావరాలపై దాడిశాటిలైట్‌ దృశ్యాలు విడుదల

దుబాయ్‌: ఇరాన్‌ రాజధానికి ఆగ్నేయంగా ఉన్న ఓ రహస్య సైనిక స్థావరం పర్చిన్‌పై జరిపిన దాడికి సంబంధించిన శాటిలైట్‌ దృశ్యాలు విడు దలయ్యాయి. ఈ స్థావరంలో అనేక భవనాలు ధ్వంసమయ్యాయి. అణ్వాయు ధాల తయారీకి సంబంధించిన అధిక పేలుడు పదార్థాల పరీక్షలను ఇరాన్‌ గతంలో నిర్వహించిందని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలను ఇరాన్‌ ఖండిరచింది. సమీపంలోని ఖోజీర్‌ సైనిక స్థావరంలో కూడా కొన్ని భవనాలు ధ్వంస మయ్యాయి. ఈ ప్రాంతంలో భూగర్భ సొరంగం వ్యవస్థ, క్షిపణి తయారీ ప్రదేశాలు ఉన్నాయని, వాటిని బయటి ప్రపంచానికి తెలియకుండా ఇరాన్‌ దాచిపెట్టిందని ఆరోపించాయి. సైనిక స్థావరాలపై దాడి నష్టాన్ని ఇరాన్‌ ధృవీకరించలేదు. ఇజ్రాయిల్‌ దాడిలో వైమానిక రక్షణ వ్యవస్థలో పనిచేస్తున్న నలుగురు ఇరాన్‌ సైనికులతో పాటు ఓ పౌరుడు మరణించినట్లు ప్రకటించింది. మృతుల వివరాలను వెల్లడిరచలేదు. ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌కు నైరుతి, పశ్చిమ ప్రాంతాల్లోని వైమానిక, సైనిక స్థావరాలపై శనివారం తెల్లవారుజామున ఇజ్రాయిల్‌ వైమానిక దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ దాడిని సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్‌, ఖతార్‌, ఈజిప్ట్‌, యెమెన్‌, మలేషియా, సిరియా, జోర్డాన్‌, లెబనాన్‌ తదితర దేశాలు తీవ్రంగా ఖండిరచాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img