బెండకాయలు కేజీ రూ.650, కాకరకాయలు కేజీ రూ.1000
లండన్: బ్రిటన్లో కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్నాయి. కాకరకాయలు కేజీ రూ.1000, బెండకాయలు కేజీ రూ.650, ఆరు ఆల్ఫోన్సో మామిడికాయలు రూ.2,400 పలుకుతున్నాయి. భారత్లోనూ నిత్యావసరాల ధరలు ఆకాశన్నంటుతున్నా…ఈ పరిస్థితి బ్రిటన్లోని భారతీయ స్టోర్స్లో నెలకొన్నది. ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక వీడియో వైరల్గా మారింది. దిల్లీకి చెందిన చావి అగర్వాల్ లండన్లో నివసిస్తున్నారు. ఇండియన్ స్టోర్స్లో ఉన్న ధరలు చూసి, ఆమె ఆశ్చర్యపోయారు. ఒక స్టోర్లో సరకుల ధరలు చూపిస్తూ ఇన్స్టాగ్రాంలో ఒక వీడియో పోస్టు చేశారు. లేస్ మాజిక్ మసాలా ప్యాక్ భారత్లో రూ.20 ఉంటుందని, కానీ లండన్లో మాత్రం దాని ఖరీదు రూ.95గా ఉందని చెప్పారు. పన్నీర్ రూ.700 ఉందన్న ఆమె… కూరగాయల ధరలు వెల్లడిరచారు. ఈ వీడియో ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. ఆ ధరలకు నెటిజన్ల గుండె గుబేలంటున్నది. అక్కడి కరెన్సీ(పౌండ్ స్టెర్లింగ్)ని మన రూపాయల్లో పోల్చి చూస్తే… ధరలు ఎక్కువగానే ఉంటాయని, అయితే రేట్లు మాత్రం కాస్త ఎక్కువేననే అభిప్రాయం వ్యక్తమైంది. బ్రిటన్ ప్రజలు ద్రవ్యోల్బణంతో ఇబ్బందిపడుతున్న మాట వాస్తవమే కానీ… ఈ వీడియో కాస్త అతిగా ఉందని ఓ నెటిజన్ స్పందించారు. అక్కడ వ్యాపారం ప్రారంభిస్తే బెటరేమో అని మరికొందరు ఫన్నీగా బదులిచ్చారు. వచ్చే నెలలో బ్రిటన్లో ఎన్నికలు జరగనున్నాయి. జీవన వ్యయ సంక్షోభం అక్కడి ప్రజల్ని ఇబ్బందిపెడుతోంది. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను గాడిన పెడతామన్న హామీతో గద్దెనెక్కిన రిషి సునాక్కు మాంద్యం పరిస్థితులు ఎన్నికల వేళ తలనొప్పిగా మారాయి.