Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

శ్రీ గిడ్డాంజనేయస్వామి హుండీ లెక్కింపు

విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) : మండల పరిధిలోని తారాపురం గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ శ్రీ గిడ్డ ఆంజనేయస్వామి హుండీ లెక్కింపు కార్యక్రమం గురువారం ఈఓ రాంప్రసాద్ ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది లెక్కించారు. 2024 ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించిన హుండీ లెక్కించడం జరిగిందన్నారు. హుండీ ఆదాయం 2,60,065 రూపాయలు వచ్చినట్లు ఆయన తెలిపారు. వచ్చిన ఆదాయాన్ని ఆలయ అభివృద్ధికి, ఉగాది ఉత్సవాలకు ఖర్చు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img