Monday, May 20, 2024
Monday, May 20, 2024

అహోబిలంలో ఘనంగా స్వాతి వేడుకలు

విశాలాంధ్ర – ఆళ్లగడ్డ : ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో శుక్రవారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా భక్తులు విశేష పూజలు నిర్వహించారు. ఎగువ దిగువ అహోబిలం క్షేత్రాలతో పాటు నవ నరసింహ క్షేత్రాలలో కూడా భక్తుల సందడి నెలకొంది. దిగువ అహోబిలంలోని శ్రీ ప్రహ్లాద వరదస్వామి ,ఎగువ అహోబిలంలోని శ్రీ జ్వాల నరసింహ స్వామి సన్నిధిలో వేద పండితులు శ్రీ స్వామి వారికి అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు. దిగువ అహోబిలంలోని శ్రీ ప్రహ్లాద వరద స్వామి ఆలయంలో స్వాతి సందర్భంగా సుదర్శన హోమం పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నవ నారసింహ క్షేత్రాలను రాయల్ కాప్స్ గౌరవ సలహాదారుడు గూడూరు సంజీవ రాయుడు, ఏపీ తెలంగాణ యూత్ పొలిటికల్ ప్రెసిడెంట్, జర్నలిస్టు అంగం శివ రాయల్ మాజీ సర్పంచ్ చౌటపల్లి పాములేటి, బండి రామచంద్రుడు, రాటాల నరసింహ తదితరులు ప్రత్యేక బృందంగా ఏర్పడి శ్రీ స్వామివార్లను దర్శించుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img