Free Porn
xbporn

buy twitter followers
uk escorts escort
liverpool escort
buy instagram followers
Galabetslotsitesi
Galabetsondomain
vipparksitesigiris
vipparkcasinositesi
vipparkresmi
vipparkresmisite
vipparkgirhemen
Betjolly
Saturday, July 27, 2024
Saturday, July 27, 2024

చలో పత్తికొండను విజయవంతం చేయండి

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : ఈనెల 28న పత్తికొండలో జరిగే రా కదలిరా కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జీ తిక్కారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం మండల కేంద్రమైన పెద్దకడబూరులో టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి స్వగృహం నందు టిడిపి మండల కన్వీనర్ బసలదొడ్డి ఈరన్న ఆధ్వర్యంలో టిడిపి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రా కదలిరా కార్యక్రమ పరిశీలకుడుగా ఎమ్మెల్సీ తిప్పయ్య స్వామి, శివబాల హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో తుగ్లక్ పాలన కొనసాగుతోందని, జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సాగనంపేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను, అక్రమాలను, మోసాలను ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో రా కదలిరా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు.అందులో భాగంగానే పత్తికొండలో రా కదలిరా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు. కావున మండలంలో ఉన్న అన్ని గ్రామాల్లోని నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు ఏసేపు, బీసీ సాధకార సమితి సభ్యులు మల్లికార్జున, నాయకులు దశరథరాముడు, మీసేవ ఆంజనేయ, అంజి, వీరేష్ గౌడ్,నరసన్న, దాసప్ప రెడ్డి, ఈరన్న, పెద్దయ్య, వెంకటరామిరెడ్డి, మల్దకల్, రాఘవ రెడ్డి, భాష, సుధాకర్, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img