విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరికి ఎమ్మెల్యే మంత్రివర్గంలోకి తీసుకోవాలని టీడీపీ ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి బొగ్గుల నరసన్న డిమాండ్ చేశారు. శనివారం మండల కేంద్రమైన పెద్దకడబూరులో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో 40 ఏళ్ల కంచుకోటను ఢీ కొట్టి జిల్లాలో అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా విజయం సాధించిన కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి మంచి విద్యావంతుడు, దళితుడిని మంత్రివర్గంలో స్థానం కల్పించాలని కోరారు.