Monday, May 20, 2024
Monday, May 20, 2024

కారు ఢీకొని తల్లీ కూతురు మృతి

విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) : మండల పరిధిలోని హనుమాపురం గ్రామ సమీపంలో ఉన్న నలంద డిగ్రీ కళాశాల సమీపంలోని జాతీయ రహదారిపై బుధవారం కారు ఢీ కొన్న ప్రమాదంలో హనుమాపురం గ్రామానికి చెందిన జయలక్ష్మి (37),అక్షర (5)అనే తల్లీ కూతురు మృతి చెందారు. జయలక్ష్మి తన కూతురుతో కలిసి పొలంకు వెళ్తూ రోడ్డు దాటుతుండగా ఆదోని నుండి ఎమ్మిగనూరు వైపు వెళుతున్న కారు బలంగా ఢీ కొట్టింది. దీంతో తల్లి, కూతురు అక్కడికక్కడే మృతిచెందారు .బంధువులు మృతదేహాల వద్ద రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. హనుమాపురం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సంఘటన స్థలాన్ని చేరుకొన్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మహేష్ కుమార్ తెలిపారు. విమృతదేహాలను పోస్టు మార్టం కోసం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img