విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) : మండల పరిధిలోని చిన్నకడబూరు గ్రామంలో భోజనం చేస్తామని ఏకంగా సోమవారం పోలింగ్ నే కొద్ది సమయం నిలిపి వేశారు. దీంతో ఓటర్లు పోలింగ్ కేంద్రాల ముందు క్యూ లో ఎన్నికల అధికారులు కూర్చోవడం గమనార్హం. ఎన్నికల నిబంధనలు తెలిసి కూడా పోలింగ్ అధికారి నిర్లక్ష్యంగా భోజనం కోసం అర గంటకు పైగా నిలిపి వేయడంతో ఓటర్లు అసహనానికి గురయ్యారు. నిబంధనలు పాటించని పీఓ పై చర్యలు తీసుకోవాలని ఓటర్లు డిమాండ్ చేశారు.