విశాలాంధ్ర, పెద్దకడబూరు : మండల పరిధిలోని రాగిమాన్ దొడ్డి గ్రామ సమీపంలో ఉన్న ఎల్ ఎల్ సి నుండి సోమవారం ఇరిగేషన్ డీఈ లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో వ్యవసాయ సలహా మండలి చైర్మన్ పురుషోత్తం రెడ్డి చేతుల మీదుగా గంగవరం డిస్ట్రిబ్యూటర్ కు సాగునీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చివరి ఆయకట్టు భూములకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏఈ మణికంఠ, వర్క్ ఇన్స్పెక్టర్లు, లస్కర్లు పాల్గొన్నారు.