విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) సామాజిక న్యాయం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తోనే సాధ్యమని మాజీ ఎంపిపి రఘురామ్, రాష్ట్ర ఖాదీ గ్రామీణ పరిశ్రమల బోర్డు ఛైర్మన్ భాగ్యమ్మ అన్నారు. శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో జరగబోయో 2024 ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యేగా నాల్గోసారి బాలనాగిరెడ్డి విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. జనం మెచ్చిన జన నాయకుడు, సంక్షేమ పథకాల రథసారథి, నవరత్నాలతో నవ శకానికి నాంది పలికిన నాయకుడు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయి 14 సంవత్సరాలు అవుతున్నా ప్రజలందరి గుండెల్లో బ్రతికే ఉన్నారని, ఆయన కుమారుడు మన ముఖ్యమంత్రి తండ్రి ఆశయ సాధనకై కృషి చేస్తూ రాష్ట్ర ప్రజల బాగోగుల విషయంలో ప్రతి కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని కొనియాడారు. రాష్ట్ర ప్రజల మేలు కోరే వైయస్ జగన్మోహన్ రెడ్డిని మరో మారు ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్యేగా బాలనాగిరెడ్డిని గెలిపించుకునేందుకు ప్రతి ఒక్కరూ సైనికుల్లా పని చేయాలని వారు పిలుపునిచ్చారు.