విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మంత్రాలయం నియోజకవర్గంలో తొలిసారి తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతుందని బీసీ సాధకార కమిటీ సభ్యులు మల్లికార్జున, టౌన్ ఉపాధ్యక్షులు మీసేవ ఆంజనేయ, బీసీ సెల్ మండల నాయకులు తలారి అంజి అన్నారు. సోమవారం మండల కేంద్రమైన పెద్దకడబూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మంత్రాలయం నుండి తొలిసారి బీసీ ముద్దు బిడ్డ రాఘవేంద్రరెడ్డి ఎమ్మెల్యేగా గెలుపు ఖాయమన్నారు. మంత్రాలయం ఎమ్మెల్యేగా రాఘవేంద్రరెడ్డికి 35 వేల మెజారిటీ వస్తుందని, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం ఖాయమని జోష్యం చెప్పారు. చంద్రబాబు ప్రకటించిన మ్యానిఫెస్టో తో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని వారు వెల్లడించారు.