Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

పది ఫలితాల్లో “విజేత” విద్యార్థుల విజయకేతనం

–మండల టాపర్ గా ఆర్.పి సందీప్ సింగ్

విశాలాంధ్ర ఆస్పరి (కర్నూలు జిల్లా) : పదో తరగతి పరీక్ష ఫలితాల్లో విజేత ఇంగ్లీష్ మీడియం హైస్కూలు విద్యార్థులు విజయ పరంపరను కొనసాగిస్తూ విజయకేతనం ఎగురవేశాయి. 2023లో ఆర్.పి జితేందర్ సింగ్ 586 మార్కులతో మండల టాపర్ గా నిలవగా నేడు వారి తమ్ముడు ఆర్.పి సందీప్ సింగ్ 580 మార్కులతో మండల టాపరుగా నిలిచాడు. 10 మందికి పైగా విద్యార్థులు 500 మార్కులు, మరో 11 మంది విద్యార్థులు 400 పైగా మార్కులు సాధించినట్లు చైర్మన్ మల్లేష్, ప్రధానోపాధ్యాయురాలు ధనలక్ష్మి లు తెలిపారు. ఈ విజయంలో ఉపాధ్యాయల శ్రమ, విద్యార్థుల సృజనాత్మకత, తల్లిదండ్రుల ప్రోత్సాహం, యాజమాన్యం కృషి ఎంతైనా ఉందని వారు తెలిపారు. సోమవారం ప్రకటించిన పరీక్ష ఫలితాల్లో 49 గాను 45 మంది విద్యార్థులు ఉత్తీర్ణత కాగా 91 శాంతం సాధించినట్లు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img